సహ చట్టం సదస్సు పై నివేదిక
సహ చట్టం విస్తృత వ్యాప్తి కి కార్యకర్తలు నడుం బిగించాలి..
ప్రజాస్వామ్యానికి వెన్నుముక్క గా నిలిచే ఆర్టీఐ విస్తృత వ్యాప్తి కి కార్యకర్తలు కృషి చేయాలని రామన్ మెగసేసే పురస్కార గ్రహీత సందీప్ పాండే అన్నారు. ఆదివారం స్థానిక శారదా గ్రంధాలయంలో యునైటెడ్ ఫోరం ఫర్ RTI కాంపెయిన్ (యూ ఎఫ్ ఆర్ టి ఐ) వారు నిర్వహించిన సహ చట్టం పై సదస్సు లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు..ఎంత ఎక్కువ గా ప్రజలు సహ చట్టాన్ని విరివిగా వ్యాప్తి చేస్తారో అప్పుడే ప్రభుత్వాలు స్వయంగా సమాచారాన్ని అందియించే విధానానికి శ్రీకారం చుడుతుందని అన్నారు.
ఒకప్పుడు సహ చట్టం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇపుడు అధ్వాన్న స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇక సహ చట్ట కార్యకర్తలపై జరుగున్న దాడులు, బెదిరింపులు ఆందోళన కలిగించే స్థాయిలో జరుగుతున్నాయని వీటిపై ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. సమాచార కమీషనర్ల నియామకాలు రాజకీయ ప్రమేయంతో జరగడం చట్టం అమలుకు మంచిది కాదని అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సహ చట్టం సవరణలు చట్టాన్ని బలహీనపరచడానికి జరుగుతున్నా ప్రయత్నాలుగా ఆయన వర్ణించారు.
విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి ఈ ఏ ఎస్ శర్మ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి తో కార్యకర్తలు పని చేయాలని, మహిళలు ఎక్కువ సంఖ్య లో దరఖాస్తుదారులైతేనే చట్టం మరింత ముందుకు పోతుందని అన్నారు. సహ చట్టం కార్యకర్తలు, వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై సహ చట్టం దరఖాస్తులు ఎక్కుపెట్టాలని అన్నారు.
యూ ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట్ర కో కన్వీనర్ చక్రధర్ బుద్ధ మాట్లాడుతూ ఉమ్మడి కమీషన్ దగ్గర ఫైల్ చేసిన అప్పీళ్ళు, ఫిర్యాదుల పరిస్థితి తెలియక దరఖాస్తుదారులు అయోమయ స్థితిలో ఉన్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
సహ చట్టం కు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా యూ ఎఫ్ ఆర్ టి ఐ వారు నెలకొల్పిన హెల్ప్ లైన్ ను వినియోగించుకోవచ్చు అని ఆయన తెలిపారు.
సమావేశం అనంతరం యూ ఎఫ్ ఆర్ టి ఐ జిల్లా కార్యవర్గం ప్రకటించారు. జిల్లా కన్వీనర్ గా రాజాన బుజ్జిబాబు ఎన్నికకాగా, కో కన్వీనర్లుగా BVV సత్యనారాయణ, సూరిసెట్టి రాము ఎన్నిక అయ్యారు. 12 మంది సబ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పడింది. వీరు 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. S. రాయవరం మండలానికి చెందిన సీనియర్ సహ కార్యకర్త గణపతిరాజు యూ ఎఫ్ ఆర్ టి ఐ కి ప్రధాన సలహాదారునిగా వ్యవహరిస్తారు.
కార్యక్రమంలో జిల్లాలో వివిధ మండలాలకు చెందిన సహ చట్టం కార్యకర్తలు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి వెన్నుముక్క గా నిలిచే ఆర్టీఐ విస్తృత వ్యాప్తి కి కార్యకర్తలు కృషి చేయాలని రామన్ మెగసేసే పురస్కార గ్రహీత సందీప్ పాండే అన్నారు. ఆదివారం స్థానిక శారదా గ్రంధాలయంలో యునైటెడ్ ఫోరం ఫర్ RTI కాంపెయిన్ (యూ ఎఫ్ ఆర్ టి ఐ) వారు నిర్వహించిన సహ చట్టం పై సదస్సు లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు..ఎంత ఎక్కువ గా ప్రజలు సహ చట్టాన్ని విరివిగా వ్యాప్తి చేస్తారో అప్పుడే ప్రభుత్వాలు స్వయంగా సమాచారాన్ని అందియించే విధానానికి శ్రీకారం చుడుతుందని అన్నారు.
ఒకప్పుడు సహ చట్టం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇపుడు అధ్వాన్న స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇక సహ చట్ట కార్యకర్తలపై జరుగున్న దాడులు, బెదిరింపులు ఆందోళన కలిగించే స్థాయిలో జరుగుతున్నాయని వీటిపై ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. సమాచార కమీషనర్ల నియామకాలు రాజకీయ ప్రమేయంతో జరగడం చట్టం అమలుకు మంచిది కాదని అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సహ చట్టం సవరణలు చట్టాన్ని బలహీనపరచడానికి జరుగుతున్నా ప్రయత్నాలుగా ఆయన వర్ణించారు.
విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి ఈ ఏ ఎస్ శర్మ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి తో కార్యకర్తలు పని చేయాలని, మహిళలు ఎక్కువ సంఖ్య లో దరఖాస్తుదారులైతేనే చట్టం మరింత ముందుకు పోతుందని అన్నారు. సహ చట్టం కార్యకర్తలు, వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై సహ చట్టం దరఖాస్తులు ఎక్కుపెట్టాలని అన్నారు.
యూ ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట్ర కో కన్వీనర్ చక్రధర్ బుద్ధ మాట్లాడుతూ ఉమ్మడి కమీషన్ దగ్గర ఫైల్ చేసిన అప్పీళ్ళు, ఫిర్యాదుల పరిస్థితి తెలియక దరఖాస్తుదారులు అయోమయ స్థితిలో ఉన్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
సహ చట్టం కు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా యూ ఎఫ్ ఆర్ టి ఐ వారు నెలకొల్పిన హెల్ప్ లైన్ ను వినియోగించుకోవచ్చు అని ఆయన తెలిపారు.
సమావేశం అనంతరం యూ ఎఫ్ ఆర్ టి ఐ జిల్లా కార్యవర్గం ప్రకటించారు. జిల్లా కన్వీనర్ గా రాజాన బుజ్జిబాబు ఎన్నికకాగా, కో కన్వీనర్లుగా BVV సత్యనారాయణ, సూరిసెట్టి రాము ఎన్నిక అయ్యారు. 12 మంది సబ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పడింది. వీరు 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. S. రాయవరం మండలానికి చెందిన సీనియర్ సహ కార్యకర్త గణపతిరాజు యూ ఎఫ్ ఆర్ టి ఐ కి ప్రధాన సలహాదారునిగా వ్యవహరిస్తారు.
కార్యక్రమంలో జిల్లాలో వివిధ మండలాలకు చెందిన సహ చట్టం కార్యకర్తలు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home