పత్రికా
ప్రకటన
అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు (RDO) మరియు డివిజన్ లోని రెవెన్యూ కార్యాలయాలలో
V. మాడుగుల, చీడికాడ ఆదివాసీల ర్యాలీ
ఈ రోజు తేది
03/12/2018 న అనకాపల్లి
రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు (RDO)
మరియు డివిజన్ లోని రెవెన్యూ
కార్యాలయాలలో RTI ని అమలు చేయాలని కోరుతూ
అఖిల భారత వ్యవసాయ మరియు గ్రామీణ కార్మిక
సంఘం (AIARLA), యునైటెడ్ ఫోరం ఫర్ RTI
(UFRTI) నాయకత్వంలో V. మాడుగుల, చీడికాడ ఆదివాసీలు ర్యాలీ నిర్వహిoచి RDO
కు మెమోరాండం అందజేశారు.
ఈ సందర్బంగా P.S. అజయ్ కుమార్ , జాతీయ కౌన్సిల్
సభ్యుడు, అఖిల భారత
వ్యవసాయ మరియు గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) మాట్లాడుతూ
అనకాపల్లి RDO కార్యాలయoకు వస్తున్న RTI ధరఖాస్తులపై స్పందన వుండటం లేదని అన్నారు. ‘ఆవు
చేలో మెస్తే దూడ గట్టున మెస్తుoదా’ అన్నట్లుగా RDO కార్యలయం లోనే చట్టం
అమలు ఈ విధoగా వుంటే దానికి తగినట్లు గానే RDO పరిధిలోకి వచ్చే మండలాల పరిస్తితి వుందని అజయ్ కుమార్ అన్నారు. అటవీ హక్కుల
చట్టం అనుసరించి RDO సబ్ – డివిజనల్ కమిటీ చైర్మెన్ గా వ్యవహరిస్తారని, V. మాడులుగుల, చీడికాడ మండలాలలో ఈ చట్టం అనుసరిoచి ఎన్ని అటవి భూలకు
వచ్చిన క్లయిం ల సమాచారo కావాలని శిరగం ఈశ్వరావు అనే ఆదివాసీ యువకుడు జులై 12 దరఖాస్తు చేస్తే ఈ
నాటికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు.
RDO లు సమాచార హక్కు
చట్టం అనుసరిచి ‘అప్పీలేట్ అధికారు’ అవుతారని కానీ
అప్పీల్ పిటిషన్ లు విచారణకు నోచుకోవటం లేదని
B.చక్రధర్, రాష్ట్ర కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ RTI (UFRTI) అన్నారు. రేపు వాయిదా అనగా ఈ రోజు నోటీసులు పోస్టు
చేస్తున్నారని వాయిదా తేదీ అయిపోయాక పిటిషనర్స్ కి అవి అందుతున్నాయ అన్నారు.
కోర్టు మొట్టికాయలు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ముగ్గుర సమాచార కమీషనర్లను నాలుగేళ్ల
తరువాత నియమించిందని. సమాచార కమీషన్ వ్యవస్తాను పదవి విరమణ చేసిన ప్రభుత్వ
ఉద్యోగులకు ‘పునరావాస కేంద్ర’ గా ప్రభుత్వం మార్చిoదని చక్రధర్ అన్నారు. RDO వెంటనే స్పందించి
అనకాపల్లి డివిజన్ లో RTI అమలుపై సమీక్ష
నిర్వహించాలని అజయ్ కుమార్, చక్రధర్ లు డిమాండ్ చేశారు.
రామచంద్ర ధియేటరు
వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుండి MRO కార్యలయం వరకూ అక్కడ
నుండి RDO కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి RDO కు విజ్జనపన పత్రం అందజేశారు.
ఇందులు V. మాడుగుల, చీడికాడ ఆదివాసీల రైతులు పాల్గొన్నారు.
భవదీయుడు
(B.చక్రధర్)
Cell No. 9246522344
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home