Round Table Conference - II
సమాచార హక్కు చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ మునగపాక cooperative Bank మేడపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో PS అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇటీవల కాలంలో చేసిన ప్రజావ్యతిరేక చట్ట సవరణలను ఉదహరించారు. రాజకీయ పార్టీలు విరాలాల కోసం electoral bonds జారీ చేయడం, లంచం ఇవ్వ జూపిన వారిని దోషులుగా చూపడం వంటి చట్ట సవరణలు అవినీతిని పెంచేటట్లు ఉన్నాయని అన్నారు. అవినీతిని అంతం చేస్తామని ఆధికారంలోనికి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
UFRTI ప్రతినిధి చక్రధర్.బి మాట్లాడుతూ సమాచార కమీషనర్ల పదవీ కాలాన్ని మార్చడం, వారి స్థాయిని తగ్గించడం వలన సహ కమీషన్ స్వయం ప్రతిపత్తి కోల్పోతుందని దాని వలన చట్టం బలహీనపడుతుందని అన్నారు. అలాగే కేంద్రం ఏ చట్టాన్ని చెయ్యాలన్నా, సవరణలు చెయ్యాలన్నా ముందుగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని చట్టం చెబుతుందని కానీ సమాచార హక్కు చట్టం సవరణల విషయంలో కేంద్రం ఆ విషయాన్ని తుంగలో తోక్కిందని అన్నారు. అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ కు చెందిన డాక్టర్ K. రవి మాట్లాడుతూ మునగపాక గ్రామానికి వచ్చే వరకు తనకు కేవలం సహ చట్టం సవరణ ప్రతిపాదనల గూర్చి మాత్రమె తెలుసనీ ఇప్పుడు మరిన్ని ప్రజావ్యతిరేక చట్ట సవరణల గూర్చి తెలుసుకొని ఆవేదన చెందుతున్నానని అన్నారు.ఇప్పటికైనా కేంద్రం సమాచార హక్కు చట్టాన్ని సవరించే ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే రాష్ట్ర సమాచార కమీషనర్ల నియామకం చెయ్యాలని రౌండ్ టేబుల్ ఉమ్మడిగా తీర్మానం ఆమోదించింది. కార్యక్రమం అమ్బెడ్కరిజమే పునాది కార్యదర్శి రాజాన బుజ్జిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మల్ల సంజీవరావు, పిట్టా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home